Minister Nadendla Manohar: ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం..
- ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవం
- ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం
- ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరతా..
- మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా చిత్తశుద్ధితో హక్కులను గుర్తించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారుడు ఫైట్ చేస్తే ఆలస్యమైనా విజయం దక్కటం ఖాయమన్నారు.
Read Also: Srisailam Temple: జనవరి 1న శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలిపివేత
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
వినియోగదారుల చట్టం లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తే అమ్మకందారుల్లో బాధ్యత పెరుగుతుందన్నారు. 75 లక్షల మందికి దీపం పథకం కింద ఇప్పటి వరకు సిలిండర్లు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రతి సంస్థ బాధ్యత తీసుకోవాలన్నారు. నమ్మకం కలిగేలా సేవలు, నాణ్యత, కొలతల్లో ఉంటే రిపీట్ కష్టమర్లుగా మారతారన్నారు. నమ్మకం కోల్పోతే ప్రతి సందర్భంలో విమర్శిస్తారన్నారు. తూనికలు కొలతల శాఖ ఇంకా పటిష్ఠం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఆకస్మిక తనిఖీలు సరిపోవు, ఇవి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కస్టమర్ అనే వ్యక్తి లేకపోతే ఏ వ్యాపారం ఉండదు అనేది తెలుసుకోవాలన్నారు. సాధ్యంకాని మిస్ లీడింగ్ ప్రకటనలు వ్యాపార సంస్థలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యాపారం పెంచుకోవటం కోసం ఇవన్నీ చేస్తున్నాయన్నారు. ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించామన్నారు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరతామని చెప్పారు. ప్రొడక్ట్ నాణ్యత, సేవలలో తప్పులు ఉంటే సోషల్ మీడియాలో ప్రజల్లోకి యువత తీసుకు వెళ్ళాలన్నారు. బలమైన చట్టాలను ప్రజలు వినియోగించు కోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!