బీహార్లోని కైమూర్లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది.