Harish Rao : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో…
Bhatti Vikramarka : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే పర్వం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష రాయలేక పోయారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా పండగ లాగా నియామక పత్రాలు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క. సంవత్సరం లోపే 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు…
Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన…
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది…
KTR : ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని, అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని, నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని ఆయన విమర్శించారు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని…
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
Ambati Rambabu : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు వ్యక్తం చేసింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు మీరు మాకు ఓటు వేయండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు ,చార్జీల మోత మోగుతుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీకి 11…