Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది. అదే సంప్రదాయాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త మోడల్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్లిఫ్ట్, విజన్ S, BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వంటి మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. వీటిలో స్కార్పియో N ఫేస్లిఫ్ట్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు స్వల్ప మార్పులు మాత్రమే రావడంతో ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్లిఫ్ట్ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా మారింది.
Also Read
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ప్రీమియం లుక్:
కొత్త స్కార్పియో N ఫేస్లిఫ్ట్లో ఫ్రంట్ డిజైన్లో పలు మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్డేటెడ్ హెడ్ల్యాంప్స్తో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశముంది.
మరోవైపు క్యాబిన్లో మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా పలు అప్డేట్స్ వచ్చే అవకాశముంది. పెద్ద 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందించవచ్చని సమాచారం. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్లలో మాత్రమే ఉన్న ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశం ఉంది.
ఇంజిన్లో మార్పులు:
మెకానికల్గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ టర్బో డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ కూడా కొనసాగనుంది. అలాగే మహీంద్రా విజన్ S ఇంకా మార్కెట్కు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీ BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ అధికారిక టీజర్లు విడుదల చేసిన తర్వాతే ఏ మోడల్ వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. ఆగస్టు 15న మహీంద్రా ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!