Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది. అదే సంప్రదాయాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త మోడల్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్లిఫ్ట్, విజన్ S, BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వంటి మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. వీటిలో స్కార్పియో N ఫేస్లిఫ్ట్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు స్వల్ప మార్పులు మాత్రమే రావడంతో ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్లిఫ్ట్ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా మారింది.
Also Read
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ప్రీమియం లుక్:
కొత్త స్కార్పియో N ఫేస్లిఫ్ట్లో ఫ్రంట్ డిజైన్లో పలు మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్డేటెడ్ హెడ్ల్యాంప్స్తో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశముంది.
మరోవైపు క్యాబిన్లో మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా పలు అప్డేట్స్ వచ్చే అవకాశముంది. పెద్ద 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందించవచ్చని సమాచారం. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్లలో మాత్రమే ఉన్న ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశం ఉంది.
ఇంజిన్లో మార్పులు:
మెకానికల్గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ టర్బో డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ కూడా కొనసాగనుంది. అలాగే మహీంద్రా విజన్ S ఇంకా మార్కెట్కు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీ BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ అధికారిక టీజర్లు విడుదల చేసిన తర్వాతే ఏ మోడల్ వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. ఆగస్టు 15న మహీంద్రా ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!