Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది. అదే సంప్రదాయాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త మోడల్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్లిఫ్ట్, విజన్ S, BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వంటి మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. వీటిలో స్కార్పియో N ఫేస్లిఫ్ట్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు స్వల్ప మార్పులు మాత్రమే రావడంతో ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్లిఫ్ట్ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా మారింది.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
ప్రీమియం లుక్:
కొత్త స్కార్పియో N ఫేస్లిఫ్ట్లో ఫ్రంట్ డిజైన్లో పలు మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్డేటెడ్ హెడ్ల్యాంప్స్తో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశముంది.
మరోవైపు క్యాబిన్లో మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా పలు అప్డేట్స్ వచ్చే అవకాశముంది. పెద్ద 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందించవచ్చని సమాచారం. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్లలో మాత్రమే ఉన్న ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశం ఉంది.
ఇంజిన్లో మార్పులు:
మెకానికల్గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ టర్బో డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ కూడా కొనసాగనుంది. అలాగే మహీంద్రా విజన్ S ఇంకా మార్కెట్కు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీ BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ అధికారిక టీజర్లు విడుదల చేసిన తర్వాతే ఏ మోడల్ వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. ఆగస్టు 15న మహీంద్రా ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!