Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
- నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా..
- భారీగా తరలివచ్చిన జనం
- కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డ కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Maha Dharna: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. వారి పాలనలో రైతుల కష్టాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇవ్వదని ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నాట్లప్పుడు కాదు.. ఓట్లప్పుడే రైతు భరోసా పడుతుందని కాంగ్రెస్ విధానాన్ని విమర్శించారు.
Also Read: Experium Eco Park: ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి చర్చకు దమ్ముంటే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లాక్ టవర్ వద్దకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రశ్నించాలంటే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నల్లగొండ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మాత్రమే కాకుండా, రైతుల కోసం తాము ఎంతగానో పనిచేస్తున్నామనే సందేశాన్ని ప్రజలకు అందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, సభ విజయవంతమవడంపై నల్లగొండ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!