CM Revanth Reddy : అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
- అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం
- రైతు బంధు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు
- ధనిక రాష్ట్రమంటూ అబద్ధాలు చెబుతూ.. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చినట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణను అప్పుల గడ్డకెక్కించినట్లు ధ్వజమెత్తారు. 2023లో మా వద్దకి రూ.7 లక్షల కోట్లు అప్పు చేయడంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.18వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసింది. ఈ రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెబుతారని నమ్ముతుంటే, ఆయన ఫామ్హౌస్లో ఉండి సోది మాట్లాడటం కాదు, నిజం చెప్పాలి. అసెంబ్లీకి రమ్మని, రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశామో అసెంబ్లీ ముందు వివరంగా చెప్పాలని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. దళితుల కోసం 3 ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్ కు ఉంటే, అది ప్రజల్ని మోసం చేయడమే అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్, ప్రజల నుంచి తప్పించి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి హామీ ఇచ్చి, స్వంత ప్రాజెక్టులలో రుణాలు చెయ్యడమే అన్యాయంగా ఉందన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
PM Modi: పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల.. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ వ్యాఖ్య
అంతేకాకుండా..’అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే. కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు చోద్యం చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం.. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం.. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా.. నీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు..
ఆయన గంభీరంగా చూస్తున్నడట.. ఎవరిని చూస్తున్నావ్? అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్.. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. మాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నం.. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం.. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం.. మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా.. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకో.. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండు..
పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి.. కేసీఆర్ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో.. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం.. పొంకనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం.. ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది.. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు.. కేసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకో’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!