ఇథియోపియాలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారి ఇథియోపియాలో పర్యటించిన ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవాన్ని కనుపరిచారు. ఆద్యంతం ఇథియోపియా నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా మోడీకి అపూర్వ గౌరవం లభించింది.
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్లో…
మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ లో పర్యటించారు. అక్కడ పీఎం మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఈరోజు అమ్మన్లో జరిగిన ఇండియా-జోర్డాన్ వ్యాపార వేదికను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మార్చడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ఇద్దరు నాయకులు వివరించారు.…
మూడు దేశాల పర్యటన కోసం సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.
Ethiopia: ఇథియోపియాలోని బోనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 71మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
Landslides : ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 13 మంది మరణించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇథియోపియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పెద్ద ఎత్తున బురద జలాలు ఏరులైపారడంతో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పలువుర్ని కాపాడారు.
Due To Landslides Triggered By Heavy Rains In Ethiopia 146 are 50 Dead: తాజాగా ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 146 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు.. దక్షిణ ఇథియోపియా లోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో జరిగిన బురద కారణంగా మృతి చెందిన వారిలో చిన్నారులు,…
తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా జాతుల ఘర్షణలతో మరోసారి నెత్తురోడింది. ఈ ఘర్షణల్లో అమ్హారా తెగకు చెందిన 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల్లో 230 మంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. జాతుల ఘర్షణలో ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇదేనని అధికారులు చెబుతున్నారు. రెబల్ గ్రూపే ఊచకోతకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తుండగా, ఆ గ్రూపు మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల…