కర్నూలు జిల్లాలో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చెట్టుకు ఒక కాయ కూడా లేదంటే నమ్ముతారా? టన్నుల కొద్దీ మామిడి పండించిన రైతులు ఇపుడు క్వింటాళ్ల దిగుబడి కూడా లేక తల్లడిల్లిపోతున్నారు. దశాబ్దాల కాలంగా ఇంత తక్కువ దిగుబడి ఎప్పుడు చూడలేదంటున్నారు రైతులు. బంగినపల్లి మామిడికి కర్నూలు జిల్లా ప్రసిద్ధి. వందేళ్ల మామిడి తోటలు ఉన్నాయంటే బంగినపల్లి మామిడి ఈ ప్రాంతంలో ఎంతగా ప్రసిద్ధి చెందిందో స్పష్టమవుతోంది. అనేక రకాల మామిడి సాగు చేస్తున్నా అందులో బంగినపల్లి…
తిరుమల కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ తీసుకుని వెళ్లకుండా కట్టుదిట్టమయిన తనిఖీలు నిర్వహిస్తోంది టీటీడీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టారు. కాలినడకన, వాహనాల్లో వస్తున్న భక్తులను అలిపిరి వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ సీసాలు, కవర్లను స్వాధీనం చేసుకొని పంపించారు. దీంతో అక్కడ డస్ట్ బిన్ అంతా ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ తో…
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారథి జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ…
తెలంగాణలో111 జీవో రద్దు హాట్ టాపిక్ అవుతోంది. ఇంత హడావిడిగా ఎందుకు జీవో రద్దుచేయడం ఎందుకని అడిగితే.. సీఎంకి ధన్యవాదాలు తెలపాలన్నారు. గతంలో అంతా ఎన్నికల హామీగా మారిపోయింది. సీఎం దీనిని రద్దుచేయడం అభినందనీయం. 111 జీవో వల్ల రైతులు భూములు అమ్ముకోలేరు. బ్యాంక్ లోన్లు, ఇల్లు కట్టుకోలేరు. రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలుచేశారన్నారు మంత్రి సబిత. చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చాం. 25 సంవత్సరాల నుంచి వున్న జీవో ఇది. ఈ జీవో…
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్…
వ్యాపారం కోసం నానా తంటాలు పడాలి. మొన్నటికి మొన్న చెన్నైలో బిర్యానీ కొంటే టమోటాలు ఫ్రీగా ఇచ్చాడో వ్యాపారి. తాజాగా హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి…
రంగారెడ్డి జిల్లాలో హైవే నెంబర్ 163 విస్తరణకు రంగం సిద్ధమయింది. అయితే ఈ రహదారిలో ఎక్కువగా మర్రి చెట్లు వున్నాయి. వీటికి వందల ఏళ్ళ చరిత్ర వుందని పరిశోధకులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. హైవే విస్తరణ కారణంగా వాటిని తిరిగి వేరేచోట పాతాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఈ మర్రి చెట్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ రహదారిపై ఇరువైపులా 900 మర్రిచెట్లు వున్నాయి. వాటిని భద్రంగా తీసి వేరేచోట భద్రపరచాలని పర్యావరణ…
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతో పాటు… ప్రతి ఒక్కరూ బాధ్యత గా వ్యవహరించాలి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్లిలేట్ అథార్టీ నూతన కార్యాలయాన్ని… అథార్టీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రారంభించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… మధ్యప్రదేశ్ లో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్…
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు..…