Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- పార్లమెంట్లో కొనసాగుతోన్న ప్రతిష్టంభన
- రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ
- కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సభ సజావుగా సాగేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు సహకరించాలని కోరగా.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. రామమందిర విరాళాల చోరీ ఆరోపణలు, జులై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసు చర్యకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముందుగా చర్చ జరగాలని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభ బుధవారం మరోసారి వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసిన అనంతరం.. పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు పరిష్కారం కనుగొనేందుకు కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. ఈ బిల్లులకు కాంగ్రెస్ సహకరించాలని రిజిజు కోరినట్లు తెలుస్తోంది.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
అయితే కీలక అంశాలపై చర్చ జరగకుండా ఎలాంటి శాసన వ్యవహారాలను ముందుకు సాగనివ్వబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. రామమందిర విరాళాల చోరీకి సంబంధించిన ఆరోపణలపై, జులై 20న జాతీయ రాజధానిలో విద్యార్థులు నిర్వహించిన నిరసనపై పోలీసుల చర్యకు సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సభలో ముందుగా చర్చ జరగాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కిరణ్ రిజిజు.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి ఏంటని రిజిజు అడిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కార్యాలయ గదిలో జరిగిన ఈ సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్లమెంట్ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి లోక్సభలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూర్తిస్థాయి ప్రశ్నోత్తరాల సమయం జరగలేదని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఐదు బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించినట్లు తెలుస్తోంది. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ సభలో నినాదాలు చేస్తున్నాయి.
బుధవారం లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థులపై పోలీసు చర్యతో పాటు పలు అంశాలపై నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. ‘‘సభ లోపలైనా, బయటైనా నినాదాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం ద్వారా మీరు సభ గౌరవాన్ని తగ్గిస్తున్నారు’’ అని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ఓం బిర్లా వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష సహకారాన్ని కోరుతున్న సమయంలో.. రామమందిర విరాళాల ఆరోపణలు, విద్యార్థులపై పోలీసు చర్య వంటి అంశాలపై ముందుగా చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!