రాష్ట్రంలో 2019 ముందు వరకు 2 ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ చేశాయి.2019లో కేంద్రం అన్ని బీచ్ శాండ్ మైనింగ్ లీజులను రద్దు చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి బీచ్ శాండ్ మైనింగ్ జరగడం లేదు.మొనాజైట్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.కేంద్ర అణుఇంధన శాఖ 2 బ్లాక్ లకు ప్రాస్పెక్టీవ్ లెస్సీ గా ఏపీఎండీసీని ఎంపిక చేసింది.వీటి మైనింగ్ కు సంబంధంచి ఇంకా అనుమతుల ప్రక్రియ పూర్తి కాలేదు.కేంద్రం ప్రతిపాదించిన రెండు బ్లాక్ ల్లో ఎటువంటి మైనింగ్ జరగడం లేదు.
అసలు మైనింగే జరగకుండా మొనాజైట్ ను ఎలా తరలిస్తారు?ఈ ఆరోపణలపై కేంద్రంకు గత ఏప్రిల్ లోనే వివరణ పంపాం.ఐబిఎం విచారణలో సదరు సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తాయి.అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డిఎఇ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించింది.
దానిలో విశాఖజిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీర ప్రాంతంలో 1978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఎపిఎండిసిని ప్రాస్పెక్టీవ్ లెస్సీగా డిఎఇ నియమించింది. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఎపిఎండిసి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా ఆ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్లుల్లో ఇప్పటి వరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదు.
Kerala: కేరళలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.
బీచ్ శాండ్ మైనింగ్ పై తాజాగా కేంద్రప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందన్నారు . రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.