AP Mining: మొనాజైట్ అక్రమ రవాణా అబద్ధం
రాష్ట్రంలో 2019 ముందు వరకు 2 ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ చేశాయి.2019లో కేంద్రం అన్ని బీచ్ శాండ్ మైనింగ్ లీజులను రద్దు చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి బీచ్ శాండ్ మైనింగ్ జరగడం లేదు.మొనాజైట్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.కేంద్ర అణుఇంధన శాఖ 2 బ్లాక్ లకు ప్రాస్పెక్టీవ్ లెస్సీ గా ఏపీఎండీసీని ఎంపిక చేసింది.వీటి మైనింగ్ కు సంబంధంచి ఇంకా అనుమతుల ప్రక్రియ పూర్తి కాలేదు.కేంద్రం ప్రతిపాదించిన రెండు బ్లాక్ ల్లో ఎటువంటి మైనింగ్ జరగడం లేదు.
అసలు మైనింగే జరగకుండా మొనాజైట్ ను ఎలా తరలిస్తారు?ఈ ఆరోపణలపై కేంద్రంకు గత ఏప్రిల్ లోనే వివరణ పంపాం.ఐబిఎం విచారణలో సదరు సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తాయి.అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డిఎఇ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించింది.
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
దానిలో విశాఖజిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీర ప్రాంతంలో 1978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఎపిఎండిసిని ప్రాస్పెక్టీవ్ లెస్సీగా డిఎఇ నియమించింది. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఎపిఎండిసి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా ఆ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్లుల్లో ఇప్పటి వరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదు.
Kerala: కేరళలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.
బీచ్ శాండ్ మైనింగ్ పై తాజాగా కేంద్రప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందన్నారు . రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!