Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నిర్ణయించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూలై 1 నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను వినియోగించరాదు. ఒకవేళ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. మున్సిపల్ చట్టాల ప్రకారం ఫైన్ కూడా విధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో గమనించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేలనే కాకుండా సముద్ర జలాలను కూడా ప్లాస్టిక్ కలుషితం చేస్తోంది. అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. భారత్లో ఏటా 41 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఈ వ్యర్థాల్లో 10-35 శాతం వాటా సింగిల్ యూజ్ ప్లాస్టిక్దే ఉంటోంది.
Read Also: Married Women: కొత్తగా పెళ్లి.. గూగుల్లో ఆ పని!
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
జూలై 1 నుంచి వాడకూడని ప్లాస్టిక్ వస్తువులు ఇవే..!!
ప్లాస్టిక్తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్లు, స్ట్రాలు, ఫోర్క్లు, స్వీట్ బాక్స్లు, ఫుడ్ ప్యాకింగ్ కవర్లు, ప్లాస్టిక్ పుల్లల ఇయర్ బడ్స్, బెలూన్ల స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, చాక్లెట్ల స్టిక్స్, ఐస్క్రీమ్ పుల్లలు, థర్మకోల్, 100 మైక్రాన్లలోపు పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు.. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటి నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ను కచ్చితంగా అమలు చేసేలా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను నియమించనుంది. అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటుంది.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..