జర్మనీలో చాన్సలర్ మెర్కెల్ 16 ఏళ్ల పాలనకు చెక్ పడనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. జర్మనీలో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్ పార్టీకి 196 సీట్లు సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 206 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ 118 సీట్లు, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ 92 సీట్లు సాధించింది. ప్రధాన ప్రత్యర్థులైన క్రిస్టియన్ యూనియన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ల పార్టీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు…
ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ వారం రోజులపాటు పర్యటించబోతున్నారు. సోమవారం నుంచి అమె వారం పాటు పర్యటనకు సంబందించిన షెడ్యూల్ను ఖరారుచేశారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రియాంకగాంధీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉత్తర ప్రదేశ్లోని కీలక నేతలతో ప్రియాంక గాంధీ వరసభేటీలు జరపబోతున్నారు. కీలక నేతలతో ఆమె మంతనాలు జరపనున్నారు. 2022 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకారు, కాంగ్రెస్…
వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు…
వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఒక్కటిగా కలిసి పనిచేసుందుకు ముందుకు వస్తున్నాయి. కాగా గోవాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటంతో బీజేపీకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ఇప్పటికే రంగంలోకి…
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…
రష్యాలోని దిగువ సభ డ్యూమాకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు పుతిన్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. దిగువ సభ డ్యూమాలో 450 స్థానాలు ఉండగా, అందులో దామాషా పద్దతిప్రకారం 225 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 198 స్థానాల్లో ఇప్పటికే పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా ఆధిక్యంలో ఉన్నది. యునైటెడ్ రష్యా పార్టీ 49.8 శాతం ఓట్లను సాధించింది. కాగా, ప్రత్యర్థ పార్టీ రష్యా కమ్యునిస్ట్ కేవలం…
వచ్చే ఏడాది గుజరాత్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సాయించాయి. ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా మార్చేసింది బీజేపీ అధిష్టానం. అటు కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రణాళికలు రచిస్తున్నది. ఆప్ సైతం తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, ఇప్పుడు మరోపార్టీ కూడా గుజరాత్ ఎన్నికలపై కన్నేసింది. అదే ఎంఐఎం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో బలమైన పార్టీగా నిలిచిన ఎంఐఎం…
త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
త్వరలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్సర్ మన్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా పాక్వియానో అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు పాక్వియానో తెరదించాడు. ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మన్నీ పాక్వియానో చిన్నతనంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, బాక్సింగ్ క్రీడను ఎంచుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. అంచలంచెలుగా…