బాబు సొంత వ్యూహాలతోనే బరిలో దిగనున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు సంకేతాలు పార్టీ శ్రేణులు, నేతలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే)ను నియమించుకున్నారు. ఆ ఎన్నికల్లో పీకే టీమ్ వ్యూహాలు, ప్రతివ్యూహాలు టీడీపీని బాగా దెబ్బతీశాయి. దీనికితోడు జగన్ ఇమేజ్ కలిసి రావడంతో గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. ఈ ఎన్నికల తర్వాత తమకు కూడా ఎన్నికల వ్యూహకర్త అవసరమని టీడీపీ అధినేత భావించారు. ఈమేరకు ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారనే వార్తలు అప్పట్లో విన్పించాయి. ఈమేరకు గడిచిన తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రాబిన్ శర్మ టీడీపీ కోసం పని చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నియమించిన వలంటీర్ల తరహాలోనే టీడీపీ సైతం నియోజకవర్గంలో ప్రతీ 50మందికి ఒక కార్యకర్తను నియమించాలని భావించింది. అయితే క్షేత్రస్థాయిలో అది సాధ్యపడలేదు. వైసీపీ ఎదుర్కొనేందుకు పెద్దగా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. టీడీపీ కేవలం నామమాత్రంగా పోటీ ఇచ్చింది. అలాగే హిందూ దేవాలయాల విషయంలో రాబిన్ శర్మ తనకు తప్పుడు డైరెక్షన్ ఇచ్చారని చంద్రబాబు భావిస్తున్నారట. రామతీర్థంకు తనను నేరుగా వెళ్లాలని సూచించడం, ఆ తర్వాత జరిగిన ఘటనలను ఆయన లెక్కలోకి తీసుకొని చంద్రబాబు మనస్థాపానికి గురయ్యారట.
దీంతో రాబిన్ శర్మ సేవలు పార్టీకి పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నాయని ఆయన భావిస్తున్నారు. ఈమేరకు ఆయనతో గతంలో టీడీపీ కుదుర్చకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. టీడీపీ నేతలు ఇటీవల తమకు ఎన్నికల వ్యూహాకర్తలు అవసరం లేదని మాట్లాడుతున్నారు. వైసీపీ మాదిరిగా మాకు పీకేలు అవసరం లేదని మేము చంద్రబాబు వ్యూహాలతోనే బరిలో దిగుతామంటూ స్పష్టం చేస్తున్నారు. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలనే టీడీపీ నేతలు ఇలా వ్యక్తం చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏదిఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తన సొంత వ్యూహాలను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగనుండటం ఆసక్తిని రేపుతోంది. ఈసారైనా చంద్రబాబు వ్యూహాలు వైఎస్ జగన్ ముందు పని చేస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!
- Tags
- chandrababu
- elections
- tdp
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
-
Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..
-
INDIA Alliance: కుప్పకూలుతున్న ఇండియా కూటమి.. పట్టుబిగిస్తున్న ఎన్డీయే..
-
Tamil Nadu Politics: బెడిసికొట్టిన స్టాలిన్ వ్యూహం.. అదే దెబ్బకొట్టిందా..?
-
Xiaomi Civi 6 Series: షియోమి సివి 6, సివి 6 ప్రో 5G ఫోన్లు త్వరలో విడుదల.. 50MP కెమెరా, ఫ్లాగ్షిప్-గ్రేడ్ ఫీచర్లు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!