Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Is Elections Happen In Andhra Pradesh Who Will Win

‘ముందస్తు’ వస్తే ఎవరి బలం ఎంత?

Published Date :September 23, 2021 , 1:41 pm
By Manohar
‘ముందస్తు’ వస్తే ఎవరి బలం ఎంత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

2019 ఎన్నికల్లో మొదలైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీ జెండానే ఎగురుతోంది. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఏదో సంక్షేమ పథకంతో లబ్ధి పొందినట్లే కన్పిస్తోంది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కన్పించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీస పోటీ ఇవ్వలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే టీడీపీ తరుపున పలువురు అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీ మాత్రం తాము వదిలేసిన ఎన్నికల్లో గెలువడం ఒక గెలుపేనా అంటూ విమర్శలు గుప్పిస్తుంది. అయితే అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ కనీస పోటీ ఇవ్వలేదు. ఆ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ ఒక్క తాడిపత్రిలో మినహా ఎక్కడ వైసీపీకి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈక్రమంలోనే టీడీపీ ముందస్తు ఓటమి భయంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఈక్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళితే టీడీపీ నుంచి ఎంతమంది నేతలు రెడీగా ఉన్నారనేది మాత్రం అనుమానంగా మారింది.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈమేరకు గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన పీకేను త్వరలోనే రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రెండేళ్లుగా సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే టాక్ ఏపీలో బలంగా విన్పిస్తుంది.

టీడీపీ మాత్రం గత రెండేళ్లలో ఏ ఎన్నికలోనూ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన దాఖాలాలు లేవు. మరోవైపు పొత్తుల్లేకుండా చంద్రబాబు హయాంలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు అటూ జనసేన కానీ, ఇటూ బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు టీడీపీ చెందిన పారిశ్రామిక వేత్తలు అమరావతి రాజధాని కారణంగా, కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే డబ్బులు ఖర్చు చేసేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇన్ సైడ్ టాక్. అంతేకాకుండా టీడీపీలో కొద్దిరోజులుగా కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళితే నష్టపోయేది టీడీపీయే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap
  • cm jagan
  • elections
  • tdp

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

  • Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

  • Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!

  • Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions