‘ముందస్తు’ వస్తే ఎవరి బలం ఎంత?
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
2019 ఎన్నికల్లో మొదలైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీ జెండానే ఎగురుతోంది. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఏదో సంక్షేమ పథకంతో లబ్ధి పొందినట్లే కన్పిస్తోంది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కన్పించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీస పోటీ ఇవ్వలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
Also Read
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
- YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్.!
- Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా
- Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే టీడీపీ తరుపున పలువురు అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీ మాత్రం తాము వదిలేసిన ఎన్నికల్లో గెలువడం ఒక గెలుపేనా అంటూ విమర్శలు గుప్పిస్తుంది. అయితే అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ కనీస పోటీ ఇవ్వలేదు. ఆ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ ఒక్క తాడిపత్రిలో మినహా ఎక్కడ వైసీపీకి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈక్రమంలోనే టీడీపీ ముందస్తు ఓటమి భయంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
ఈక్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళితే టీడీపీ నుంచి ఎంతమంది నేతలు రెడీగా ఉన్నారనేది మాత్రం అనుమానంగా మారింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈమేరకు గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన పీకేను త్వరలోనే రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రెండేళ్లుగా సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే టాక్ ఏపీలో బలంగా విన్పిస్తుంది.
టీడీపీ మాత్రం గత రెండేళ్లలో ఏ ఎన్నికలోనూ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన దాఖాలాలు లేవు. మరోవైపు పొత్తుల్లేకుండా చంద్రబాబు హయాంలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు అటూ జనసేన కానీ, ఇటూ బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు టీడీపీ చెందిన పారిశ్రామిక వేత్తలు అమరావతి రాజధాని కారణంగా, కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే డబ్బులు ఖర్చు చేసేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇన్ సైడ్ టాక్. అంతేకాకుండా టీడీపీలో కొద్దిరోజులుగా కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళితే నష్టపోయేది టీడీపీయే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- ap
- cm jagan
- elections
- tdp
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!