రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 14 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
Interesting News: మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం. ప్రపంచం మొత్తమ్మీద మనలాంటోళ్లు కనీసం ఆరేడుగురైనా ఉంటారట. దీనికి తాజా ఉదాహరణ.. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తమిళ క్యారక్టర్ ఆర్టిస్ట్ మణివణ్ణన్. ఏక్నాథ్ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు.
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఎన్నికైన తర్వాత శివసేనపై పట్టు కోసం పోరాడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడైన నిహార్ థాక్రే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు.
Maharashtra Former Chief Minister Uddhav Thackeray Team Plea at Supreme Court over EC Order. Uddav Thakeray, Latest News, Telugu News, Breaking News, Eknath Shinde
శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వర్గాలు ఈసీకి పత్రాలు సమర్పించాయి. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎవరిదో తేల్చేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.
హిందీ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లతా మంగేష్కర్, ఆశాభోస్లే, మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్ వంటి వారితో పనిచేసిన ప్రముఖ గాయకుడు, గిలారిస్ట్ భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యానర్ తో పోరాటం చేస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యపరమైన ఇతర సమస్యల కారణంగా భూపేందర్ సింగ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మౌసమ్’లో ఆయన పాడిన పాట ‘దిల్ దూండ్తా…
Eknath Shinde: తనను వ్యతిరేకించేవాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సవాల్ విసిరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన 50 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.