Bhupinder Singh: బాలీవుడ్ లో విషాదం… ప్రముఖ గాయకుడి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లతా మంగేష్కర్, ఆశాభోస్లే, మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్ వంటి వారితో పనిచేసిన ప్రముఖ గాయకుడు, గిలారిస్ట్ భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యానర్ తో పోరాటం చేస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యపరమైన ఇతర సమస్యల కారణంగా భూపేందర్ సింగ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మౌసమ్’లో ఆయన పాడిన పాట ‘దిల్ దూండ్తా హై ఫిర్ వహీ పుర్సత్ కే రాత్ దిన్’ పాటను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. వైవిధ్యమైన పలు గీతాలను పాడటంతో పాటుగా గిటారిస్టుగా ఆయన అందించిన వాద్య సహకారం ఎంతో గొప్పది.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
అమృత్ సర్ లో పుట్టిన భూపేందర్ సింగ్ పెరిగింది ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్ లో. తండ్రి ప్రొఫెసర్ నాథా సింగ్ వాద్యకారులు కావడంతో ఆయన దగ్గరే సంగీతాన్ని అభ్యసించాడు భూపేందర్. యుక్తవయసులోనే వివిధ వాద్య పరికరాలను ఉపయోగించడం అలవాటైంది. గిటార్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నాక ఆల్ ఇండియా రేడియోలో సతీశ్ భాటియా నేతృత్వంలో క్యాజువల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. భూపేందర్ గొంతులోని మాధుర్యాన్ని గుర్తించిన సతీశ్ భాటియా… ఓసారి మదన్ మోహన్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు భూపేందర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత మదన్ మోహన్ ‘హకీకత్’ మూవీలో పాట పాడే అవకాశాన్ని భూపేందర్ సింగ్ కు ఇచ్చారు. ఆ తర్వాత రఫీ, మన్నాడే, తలత్ మహమూద్ తదితరులతో మదన్ మోహన్ ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆర్డీ బర్మన్ టీమ్ లో చాలా కాలం భూపేందర్ సింగ్ గిటార్ ప్లేయర్ గా ఉన్నారు. ఆయన గొంతులోని గాంభీర్యత రెగ్యులర్ పాటలు పాడటానికి ఉపయోగపడలేదు. అందుకే విషాద గీతాలను, విరహ గీతాలను మాత్రమే సంగీత దర్శకులు ఆయనతో పాడిస్తూ వచ్చారు. 1980 నుండి ఆయన తన భార్య మిథాలీ ముఖర్జీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ పాడటం మొదలు పెట్టారు. గజల్స్ మీద ఉన్న ఆసక్తితో వాటికే ప్రాధాన్యమిచ్చారు. అలానే అనేక స్టేజ్ షోస్ ఇచ్చారు. లలిత సంగీత విభాగంలో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది. భూపేందర్ సింగ్ మృతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!