Bhupinder Singh: బాలీవుడ్ లో విషాదం… ప్రముఖ గాయకుడి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లతా మంగేష్కర్, ఆశాభోస్లే, మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్ వంటి వారితో పనిచేసిన ప్రముఖ గాయకుడు, గిలారిస్ట్ భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యానర్ తో పోరాటం చేస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యపరమైన ఇతర సమస్యల కారణంగా భూపేందర్ సింగ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మౌసమ్’లో ఆయన పాడిన పాట ‘దిల్ దూండ్తా హై ఫిర్ వహీ పుర్సత్ కే రాత్ దిన్’ పాటను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. వైవిధ్యమైన పలు గీతాలను పాడటంతో పాటుగా గిటారిస్టుగా ఆయన అందించిన వాద్య సహకారం ఎంతో గొప్పది.
Also Read
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
అమృత్ సర్ లో పుట్టిన భూపేందర్ సింగ్ పెరిగింది ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్ లో. తండ్రి ప్రొఫెసర్ నాథా సింగ్ వాద్యకారులు కావడంతో ఆయన దగ్గరే సంగీతాన్ని అభ్యసించాడు భూపేందర్. యుక్తవయసులోనే వివిధ వాద్య పరికరాలను ఉపయోగించడం అలవాటైంది. గిటార్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నాక ఆల్ ఇండియా రేడియోలో సతీశ్ భాటియా నేతృత్వంలో క్యాజువల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. భూపేందర్ గొంతులోని మాధుర్యాన్ని గుర్తించిన సతీశ్ భాటియా… ఓసారి మదన్ మోహన్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు భూపేందర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత మదన్ మోహన్ ‘హకీకత్’ మూవీలో పాట పాడే అవకాశాన్ని భూపేందర్ సింగ్ కు ఇచ్చారు. ఆ తర్వాత రఫీ, మన్నాడే, తలత్ మహమూద్ తదితరులతో మదన్ మోహన్ ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆర్డీ బర్మన్ టీమ్ లో చాలా కాలం భూపేందర్ సింగ్ గిటార్ ప్లేయర్ గా ఉన్నారు. ఆయన గొంతులోని గాంభీర్యత రెగ్యులర్ పాటలు పాడటానికి ఉపయోగపడలేదు. అందుకే విషాద గీతాలను, విరహ గీతాలను మాత్రమే సంగీత దర్శకులు ఆయనతో పాడిస్తూ వచ్చారు. 1980 నుండి ఆయన తన భార్య మిథాలీ ముఖర్జీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ పాడటం మొదలు పెట్టారు. గజల్స్ మీద ఉన్న ఆసక్తితో వాటికే ప్రాధాన్యమిచ్చారు. అలానే అనేక స్టేజ్ షోస్ ఇచ్చారు. లలిత సంగీత విభాగంలో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది. భూపేందర్ సింగ్ మృతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!