తెలంగాణలో గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఆసక్తి రేపింది. ఎట్టకేలకు హుజురాబాద్ సమరంలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది. ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు పట్టం కట్టారు. 22 రౌండ్ల ద్వారా కౌంటింగ్ జరగ్గా.. 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల విజయకేతనం ఎగురవేశారు. రౌండ్ల వారీగా ఫలితం:మొదటి రౌండ్: బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్కు 4,444 ఓట్లు-బీజేపీ మెజారిటీ 166 ఓట్లురెండో రౌండ్: బీజేపీకి 4,851 ఓట్లు, టీఆర్ఎస్కు 4,659 ఓట్లు-బీజేపీ మెజారిటీ…
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ మూవీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ‘RRR’ కాకుండా బీజేపీ ‘RRR’కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్, గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్రావు…
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.5వేల కోట్లను ఖర్చు చేసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇచ్చారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. Read Also: టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ఈటల హవా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 14 రౌండ్ల ఫలితాలు పూర్తిగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం చూపించారు. మిగతా 12 రౌండ్లలో ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. 14 రౌండ్ల ఫలితాలు ముగిసే సరికి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. Read Also: హుజురాబాద్ ఈటల కంచుకోట..? అయితే టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి…
తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి…
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్లోని 262వ నంబర్ పోలింగ్ బూత్లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు.…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హోటల్లో కలిశారన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదన్నారు. Read Also: మంత్రి కేటీఆర్ ట్వీట్కి రాజాసింగ్…
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్లో మత్స్యకారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ప్రజలు గతంలో ఈటెలకు ఓట్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఆయన ఏం చేశారని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్…
ఈటల బిజేపిలో చేరడంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఈటల పై పోలీసు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని.. ఒత్తిడి తప్పించుకోవడానికి ఈటల ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ ఆధిపత్యం కోసం ఈటలతో పాటు.. ఆయన భార్య జమున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీకాదు, ఫక్తు ఫాల్తూ పార్టీగా మారిందని…
ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు…