ఈటెలపై కేసీఆర్ కక్ష కడితే రెండోసారి మంత్రి పదవి ఇస్తారా?: తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్లో మత్స్యకారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ప్రజలు గతంలో ఈటెలకు ఓట్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఆయన ఏం చేశారని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజక వర్గంలో ఎన్నడూ పర్యటించ లేదని.. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆయన హుజురాబాద్కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని తలసాని ఆరోపించారు.
ఈటెలపై సీఎం కేసీఆర్ కక్ష కడితే రెండో సారి మంత్రి పదవి ఎందుకు ఇస్తారని తలసాని సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా వారం సమయం ఉందని.. ఈటెల కావాలంటే మమ్మల్ని తిట్టుకోవచ్చన్నారు. కానీ ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి హుజూరాబాద్ ప్రాంతానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకురావాలని తలసాని సవాల్ విసిరారు. గెల్లు శ్రీనివాస్ యువకుడు అని, కానీ ప్రజలకు సేవ చేయడానికి సీనియర్ జూనియర్ అనేది అవసరం లేదన్నారు. దళిత బంధును ఈటెల గతంలో స్వాగతించారని.. ఇప్పుడు అడ్డుకుంటున్నారని తలసాని ఆరోపించారు. కేంద్రం ఇప్పటివరకూ తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. విపక్షాలు ఒకటి, రెండు ఇష్యూస్ పట్టుకుని కావాలనే హడావుడి చేస్తున్నాయని తలసాని ఫైరయ్యారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని.. కానీ ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ ప్రకారం ఖాళీలు భర్తీ అవుతాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష 14 వేల ఉద్యోగాలు ఇచ్చిందని… కావాలంటే ఈ విషయాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుని తెలుసుకోవచ్చని విపక్షాలకు హితవు పలికారు.
Also Read
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..