Warangal Bund: నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా…
రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
AISF: నేడు రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. తెలంగాణ జిల్లాలన్నింటిలో పాఠశాలల బంద్ పాటించనున్నారు. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు.
Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని…
ఒమిక్రాన్ ఎంట్రీతో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే సమయంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న తరుణంలో సెలవులను జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, ఈ నెలతో సెలవులు ముగిసిపోనున్నాయి.. మరోవైపు.. ఆన్లైన్తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత నెలకొనడం లేదు. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోమారు సమ్మెకు పూనుకున్నారు. దీంతో ఏపీలో మరోసారి పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించారాని అయన అన్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగ…
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల…