Warangal Bund: కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు.. నేడు వరంగల్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Bund: నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు నేపథ్యంలో వరంగల్ లోని స్కూల్స్ కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించింది. దీంతో వరంగల్ లో ఉద్రికత్త నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీని వివాదం చుట్టుముట్టింది. ఆ వివాదాల సుడి నుంచి విద్యార్థులను గట్టెక్కించాల్సిన పాలకమండలి చేతులెత్తేసింది. మరోవైపు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థి లోకం అయోమయంలో పడింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతును యూనివర్సిటీకి దూరం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అయిన చరిత్ర ఈ యూనివర్సిటీకి ఉంది. అలాంటి యూనివర్సిటీ ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. విద్యార్థుల చదువుల పురోగతి ఇసుకలా మారింది. నిత్య పోరాటాలతో ఈ యూనివర్సిటీలోని విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. కొత్త కోర్సుల చర్చ విశ్వవిద్యాలయ పరిపాలనను ఉన్మాదానికి గురి చేసింది. పీహెచ్ డీ కేటగిరీ-2 అడ్మిషన్లు బారీ స్థాయిలో జరిగాయని, లక్షల రూపాయలకు అడ్మిషన్లు అమ్ముకున్నారని బాధిత విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసనలు అదుపు తప్పడంతో వారం రోజుల క్రితం పరిపాలన కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించి వీసీ ఛాంబర్లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై చూపడంతో వివాదం మరింత ముదిరింది.
ధర్నాలు, నిరసనలు చేస్తున్న విద్యార్థులకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఒకవైపు పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం కొనసాగుతుండగా మరోవైపు పాలకవర్గం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మరిన్ని కొత్త వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అన్ని విద్యలు విద్యార్థి లోకాన్ని అయోమయంలో పడేశాయి. ఏకంగా 18వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీకి సెలవు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 3000 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించి హాస్టల్ గదులు, మెస్లకు తాళాలు వేశారు. నాన్ బోర్డర్లు హాస్టళ్లను పూర్తిగా ఖాళీ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. మొదటగా గత నెల 24 నుంచి 5వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో 10వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. కానీ వివాదం సద్దుమణగకపోవడంతో ఈ సెలవులను 18వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. తన జీవితం చివరిదశకు చేరుకుందని భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు ఉమ్మడి జిల్లా బంద్కు కేయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Noida: కోటి కోసం లాయర్ భార్యను హత్య చేసి.. స్టోర్ రూంలో దాక్కున్న మాజీ ఐఏఎస్ భర్త
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!