Warangal Bund: కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు.. నేడు వరంగల్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Bund: నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు నేపథ్యంలో వరంగల్ లోని స్కూల్స్ కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించింది. దీంతో వరంగల్ లో ఉద్రికత్త నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీని వివాదం చుట్టుముట్టింది. ఆ వివాదాల సుడి నుంచి విద్యార్థులను గట్టెక్కించాల్సిన పాలకమండలి చేతులెత్తేసింది. మరోవైపు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థి లోకం అయోమయంలో పడింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతును యూనివర్సిటీకి దూరం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అయిన చరిత్ర ఈ యూనివర్సిటీకి ఉంది. అలాంటి యూనివర్సిటీ ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. విద్యార్థుల చదువుల పురోగతి ఇసుకలా మారింది. నిత్య పోరాటాలతో ఈ యూనివర్సిటీలోని విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. కొత్త కోర్సుల చర్చ విశ్వవిద్యాలయ పరిపాలనను ఉన్మాదానికి గురి చేసింది. పీహెచ్ డీ కేటగిరీ-2 అడ్మిషన్లు బారీ స్థాయిలో జరిగాయని, లక్షల రూపాయలకు అడ్మిషన్లు అమ్ముకున్నారని బాధిత విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసనలు అదుపు తప్పడంతో వారం రోజుల క్రితం పరిపాలన కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించి వీసీ ఛాంబర్లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై చూపడంతో వివాదం మరింత ముదిరింది.
ధర్నాలు, నిరసనలు చేస్తున్న విద్యార్థులకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఒకవైపు పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం కొనసాగుతుండగా మరోవైపు పాలకవర్గం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మరిన్ని కొత్త వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అన్ని విద్యలు విద్యార్థి లోకాన్ని అయోమయంలో పడేశాయి. ఏకంగా 18వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీకి సెలవు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 3000 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించి హాస్టల్ గదులు, మెస్లకు తాళాలు వేశారు. నాన్ బోర్డర్లు హాస్టళ్లను పూర్తిగా ఖాళీ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. మొదటగా గత నెల 24 నుంచి 5వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో 10వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. కానీ వివాదం సద్దుమణగకపోవడంతో ఈ సెలవులను 18వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. తన జీవితం చివరిదశకు చేరుకుందని భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు ఉమ్మడి జిల్లా బంద్కు కేయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Noida: కోటి కోసం లాయర్ భార్యను హత్య చేసి.. స్టోర్ రూంలో దాక్కున్న మాజీ ఐఏఎస్ భర్త
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?