Hijab Row: బెంగళూరులో నిరసనలపై 2 వారాల నిషేధం..
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో హిజాబ్లపై నిరసనలు, ఆందోళనలు, ఘర్షణల నేపథ్యంలో బెంగళూరులో రెండు వారాల పాటు విద్యా సంస్థల దగ్గర అన్ని సమావేశాలు మరియు నిరసనలను నిషేధించారు.
Read Also: Vijayashanti: కేసీఆర్ పక్కా హిందూ వ్యతిరేకి..! కేవలం వాటికోసమే యాగాలు..!
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
కాగా, కర్ణాటకలో నిరసనల మధ్య, మితవాద గ్రూపులు తరగతి గదులలో హిజాబ్ ధరించే హక్కుపై ముస్లిం బాలికలను టార్గెట్ చేశాయి.. విద్యార్థుల నిరసనలు మరిన్ని కళాశాలలకు వ్యాపించడంతో పోలీసులు రాళ్లు రువ్వడం, ఘర్షణకు దిగడం వంటి ఘటనలు మంగళవారం నివేదించబడ్డాయి.. శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి.. అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సూచించారు. మరోవైపు.. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. తదుపరి తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు న్యాయస్థానం.. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.. కాగా, కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్ర సరిహద్దులు దాటి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలో మంగళవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ నిన్న తాను హిజాబ్ నిషేధానికి మద్దతిస్తున్నానని, పాఠశాలల్లో డ్రెస్ కోడ్కు తాను మద్దతిస్తున్నానని చెప్పినప్పటికీ, విద్యాసంస్థల్లో హిజాబ్లను నిషేధించే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!