న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రివర్టన్ తీరంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 6.8 మధ్య ఉన్నట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో…
మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున (2.25 గంటలకు) అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) పేర్కొంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని ఎన్సీఎస్ తెలిపింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో సహా…
Earthquake : సాధారణంగా భూకంపం వస్తే జనాలు భయపడుతుంటారు. కానీ ప్రపంచంలో సగటున రోజుకు 1000 భూకంపాలు వచ్చే దేశం ఉంది .. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం.
PM Modi: ఈ రోజు (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు.. అందరు ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.
Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్లు పేర్కొనింది.
రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్టాయ్ రిపబ్లిక్లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ఇప్పుడు మరో భారీ భూకంపం వణికించింది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే సముద్రంలో సంభవించిన ఈ భూకంపం భూమిపై ప్రకంపనలు వచ్చాయా లేదా అన్నది ఇంకా…
జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. నైరుతి జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్కు సునామీ…