Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..
- మయన్మార్ భూకంపంలో భారీగా శక్తి విడుదల..
- భూకంపం 334 అటామిక్ బాంబులకు సమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar Earthquake: గత వారంలో మయన్మార్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని నాశనం చేసింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్తో పాటు థాయ్లాండ్లోని పలు భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా మయన్మార్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు, 1700 మంది చనిపోయారు, ఇంకా శిథిలాల కింద వేల మంది ఉన్నారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, భూకంపం వల్ల మొత్తం మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also: Sanoj Mishra : మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్
Also Read
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ఇదిలా ఉంటే, ప్రముఖ అమెరిక్ జియోలజిస్ట్ ప్రకారం, మయన్మార్ భూకంపం ఏకంగా 300 కంటే ఎక్కువ అణు బాంబులకు సమానం అని చెప్పారు. ‘‘ఇలాంటి భూకంపం విడుదల చేసే శక్తి దాదాపుగా 334 అణు బాంబులకు సమానం’’ అని జియోలజిస్ట్ జెస్ ఫీనిక్స్ సీఎన్ఎన్కి చెప్పారు. శుక్రవారం మయన్మార్లో వచ్చిన భూకంపం తర్వాత వస్తున్న ప్రకంపనలు నెలల తరబడి కొనసాగవచ్చే అని ఆమె చెప్పారు. మయన్మార్ కింద ఉన్న ఇండియన్ టెక్లానిక్ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ కింద చొచ్చుకుపోతుండటం వల్ల ఈ భూకంపం వచ్చినట్లు ఆమె తెలిపారు.
నాలుగు ఏళ్ల క్రితం సైనిక తిరుగుబాటుతో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ నాశనమైంది. 5 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇప్పుడు భూకంపం కారణంగా మరిన్ని దెబ్బతింది. భూకంపం తర్వాత కూడా రెబల్స్ దాడులు చేస్తుండటం చూస్తే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, భూకంప బాధిత దేశానికి సాయం అందించేందుకు భారత్ ఇప్పటికే ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!