Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Earthquake: ఫిలిప్పీన్స్లోని మిండనావోలో తీవ్ర భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.
Ladakh Earthquake: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాస్తంగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదోక ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. శనివారం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో భూకంపం చోటుచేసుకోగా.. ఇదే రోజు లెహ్ లడఖ్లోనూ భూకంపం సంభవించడం గమనార్హం. ఇవాళ ఉదయం 8. 25 నిమిషాల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతో అక్కడ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.…
Earthquake: బంగ్లాదేశ్లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Earthquake: ఉదయమే పాపువా న్యూ గినియా, చైనా, పాకిస్తాన్తో సహా ప్రపంచంలోని మూడు దేశాలలో బలమైన భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే మంగళవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Earthquake in Maharashtra: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉంది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైంది.
Earthquake: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్సీఎస్) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు రాత్రి 7.36 గంటలకు 120 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీనికి ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.