Arvind Kejriwal: కాలుష్యం నుంచి ప్రజల్ని రక్షించేందుకు బాణాసంచాపై నిషేధం అవసరమని, ఇందులో హిందూ-ముస్లిం కోణం లేదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అన్నారు. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని కోరారు. ‘‘మనం ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తు్న్నామని కాదు, మనం మనకు మేలు చేసుకుంటున్నాము. ఎందుకంటే పటాసులు కాల్చడం వల్ల కాలుస్యంతో బాధపడుతాము’’ అని అన్నారు. Read Also: Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు..…
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
లడఖ్లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు, సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్, ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య, దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు లడఖ్లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా అవసరం.
అమెరికాలోని వైట్హౌస్లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Diwali Accident : దీపావళి అంటే దీపాలు, పటాకుల పండుగ. ఈ రోజున ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళికి పటాకులు పేల్చే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా, సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 31న సైన్యంలో కలిసి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకులు జరుపుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికులతో కలిసి పండగ చేసుకోనున్నారు. ఇటీవల సమయాల్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతం చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉంది.