జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ లో నా కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ నాతో కలిశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ నాతో పొత్తు పెట్టుకుంటనని నాకు జైల్లో కలిసి చెప్పారన్నారు.