India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New Airline Rules: దేశంలోని విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ దక్కనుంది. విమానంలో సీటు సెలక్షన్ కోసం అదనపు ఛార్జీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నియమాల ప్రకారం.. విమానంలో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ 60 శాతం సీట్లు ప్రయాణికులే ఎంపిక చేసుకునేలా ఆదేశాలిచ్చింది. ఇక ఒకే బుకింగ్ సంఖ్యతో ప్రయాణిస్తున్న వారిని ఒకే దగ్గర సీట్లలో కూర్చోబెట్టేలా కూడా సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు లేదా ఒక గ్రూప్గా ప్రయాణించే వారు పక్కపక్కనే కూర్చోవాలంటే ఇప్పటివరకు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయాణికులు ఒకే బుకింగ్తో ఉంటే వీలైనంత వరకు సమీప సీట్లలోనే కూర్చోబెట్టాలని ఆదేశించారు.
READ MORE: RGV Reviews: ధురంధర్-2’పై రామ్గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ఇంతే కాదు.. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని సదుపాలపై పౌర విమానయాన శాఖ సూచనలు చేసింది. క్రీడాకారులు, కళాకారులకు గతంలో వచ్చిన ఇబ్బందులపై స్పందిస్తూ.. క్రీడా సామగ్రి, సంగీత వాద్యాలు వంటి వస్తువులను విమానాల్లో తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన విధానం ఉండాలని సూచించింది. భద్రతా నిబంధనలను పాటిస్తూనే మరోవైపు.. ప్రయాణికుల సౌకర్యాలకు ఏ మాత్రం భంగం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఇక చాలా మంది కొన్ని పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లాని భావిస్తారు. ఈ పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లే విధానం ఇప్పటికీ సరిగ్గా లేదు. ఈ అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని సంస్థలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విమాన ప్రయాణికుల హక్కుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విమాన ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఉన్న హక్కులను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. ఈ హక్కులను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, టికెట్ బుకింగ్ వేదికలు, విమానాశ్రయ కౌంటర్లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
READ MORE: Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!