India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New Airline Rules: దేశంలోని విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ దక్కనుంది. విమానంలో సీటు సెలక్షన్ కోసం అదనపు ఛార్జీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నియమాల ప్రకారం.. విమానంలో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ 60 శాతం సీట్లు ప్రయాణికులే ఎంపిక చేసుకునేలా ఆదేశాలిచ్చింది. ఇక ఒకే బుకింగ్ సంఖ్యతో ప్రయాణిస్తున్న వారిని ఒకే దగ్గర సీట్లలో కూర్చోబెట్టేలా కూడా సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు లేదా ఒక గ్రూప్గా ప్రయాణించే వారు పక్కపక్కనే కూర్చోవాలంటే ఇప్పటివరకు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయాణికులు ఒకే బుకింగ్తో ఉంటే వీలైనంత వరకు సమీప సీట్లలోనే కూర్చోబెట్టాలని ఆదేశించారు.
READ MORE: RGV Reviews: ధురంధర్-2’పై రామ్గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
ఇంతే కాదు.. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని సదుపాలపై పౌర విమానయాన శాఖ సూచనలు చేసింది. క్రీడాకారులు, కళాకారులకు గతంలో వచ్చిన ఇబ్బందులపై స్పందిస్తూ.. క్రీడా సామగ్రి, సంగీత వాద్యాలు వంటి వస్తువులను విమానాల్లో తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన విధానం ఉండాలని సూచించింది. భద్రతా నిబంధనలను పాటిస్తూనే మరోవైపు.. ప్రయాణికుల సౌకర్యాలకు ఏ మాత్రం భంగం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఇక చాలా మంది కొన్ని పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లాని భావిస్తారు. ఈ పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లే విధానం ఇప్పటికీ సరిగ్గా లేదు. ఈ అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని సంస్థలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విమాన ప్రయాణికుల హక్కుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విమాన ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఉన్న హక్కులను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. ఈ హక్కులను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, టికెట్ బుకింగ్ వేదికలు, విమానాశ్రయ కౌంటర్లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
READ MORE: Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!