Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరు.. నేను తప్పు చేసినా వదలొద్దు..
- జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్..
- తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచన..
- నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దన్న పవన్ కల్యాణ్..
Deputy CM Pawan Kalyan: గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అని అసెంబ్లీ వేదికగా దుయ్యబట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇప్పుడు జనసేన సభ్యులు కూడా ఎవరూ గీత దాటరన్న ఆయన… తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అన్నారు.. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అని సూచించారు.. రాష్ట్ర భవిష్యత్తు పునర్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించే సంస్కారం సీఎం చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేపట్టాం. కానీ, వైసీపీ వచ్చి మూడు రాజధానులని చెప్పింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని కావాలన్నారు.
Read Also: Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ఇక, కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ 15 వేల కోట్లు ఇవ్వటం స్వాగతిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ పాలనలో పోలవరం కట్టలేక పోయారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారు. ఖజానా ఖాళీ చేశారు, సహజ వనరుల దోపిడి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పవన్ కల్యాణ్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని పేర్కొన్న ఆయన.. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ కల్యాణ్ సామాజిక బాధ్యతతో ఆలోచించారని కొనియాడారు.. ఇక, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
-
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
-
Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
-
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!