Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరు.. నేను తప్పు చేసినా వదలొద్దు..
- జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్..
- తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచన..
- నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దన్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అని అసెంబ్లీ వేదికగా దుయ్యబట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇప్పుడు జనసేన సభ్యులు కూడా ఎవరూ గీత దాటరన్న ఆయన… తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అన్నారు.. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అని సూచించారు.. రాష్ట్ర భవిష్యత్తు పునర్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించే సంస్కారం సీఎం చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేపట్టాం. కానీ, వైసీపీ వచ్చి మూడు రాజధానులని చెప్పింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని కావాలన్నారు.
Read Also: Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
ఇక, కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ 15 వేల కోట్లు ఇవ్వటం స్వాగతిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ పాలనలో పోలవరం కట్టలేక పోయారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారు. ఖజానా ఖాళీ చేశారు, సహజ వనరుల దోపిడి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పవన్ కల్యాణ్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని పేర్కొన్న ఆయన.. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ కల్యాణ్ సామాజిక బాధ్యతతో ఆలోచించారని కొనియాడారు.. ఇక, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!