Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
- ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు..
- జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన డిప్యూటీ సీఎం..
- జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా..
- నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చకొట్టడం.. ఇదంతా అతని అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు.. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా.. వైఎస్ జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో..? అని సెటైర్లు వేశారు.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Deadpool & Wolverine: కుర్చీ మడతెట్టడమే అంటున్న ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’ ట్రైలర్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
మరోవైపు.. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దాం అని సూచించారు.. ఇక, వైఎస్ జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే అతనికి భంగపాటు తప్పదు అని హెచ్చరించారు.. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతణ్ని పట్టించుకునేవారు లేరంటూ ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
Read Also: CJI DY Chandrachud: పేపర్ లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చు..
కాగా, అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు ఫ్రస్ట్రేషనులో ఉన్నారని ఇంకొందరు సభ్యులు భేటీలో పేర్కొన్నారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్న పలువురు జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు తెలిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!