Pawan Kalyan: మంత్రులను మాయ చేసేలా అధికారుల సమాచారం.. డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి..!
- అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ..
- మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని విమర్శలు..
- ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటోన్న మంత్రులు..
- గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు. ఇక, గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా అవును.. కాదు.. ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను ఉప ముఖ్యమంత్రి అడిగారు.
Read Also: Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?
Also Read
ఇక, అనుబంధ పత్రాల్లో కాకుండా.. సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు పైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంత మాత్రం మళ్లించ లేదని సదరు అధికారులు సమాచారమిచ్చారు.. అధికారుల సమాచారానికి భిన్నంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సభలో సమాధానం ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేదని మంత్రి డోలా పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!