ఏప్రిల్ 29న రాత్రి ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్- టాల్స్టాయ్ మార్గ్ కూడలి వద్ద ఘోరం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్యూవీ ఢీకొట్టింది. కారు బైక్ను ఢీకొట్టడంతో ముకుల్ (20) బైక్పై నుంచి కింద దూకేశాడు. వీరిని ఢీకొన్న కారు పైకప్పుపై బైక్ నడుపుతున్న దీపాంశు వర్మ (30) పడిపోయాడు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.
12-year-old boy mauled to death by stray dogs: అభం శుభం తెలియని చిన్నారుల పాలిట మృత్యవుగా మారుతున్నాయి కుక్కలు. పిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు వీరికి ఈజీ టార్గెట్ అవుతున్నారు. దేశంలో రోజుల వ్యవధిలో ఎక్కడో చోట కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అసలు వీటి గురించి పట్టించుకోవడమే లేదు. ఇదిలా ఉంటే వీధికుక్కల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలుడిని చంపేశాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఎంపీ కారు డ్రైవర్ ఓ వ్యక్తి పట్ట అమానుషంగా ప్రవర్తించాడు. తన వాహనాన్ని ఎందుకు గుద్దుతున్నావని అడిగిన పాపానికి తనపైకి కారును ఎక్కించేందుకు యత్నించాడు.
Delhi: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో తెలిసిన వారి నుంచి బాలికలు, మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు తేడా తెలియకపోవడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చాలా సందర్భాల్లో పరువు కారణంగా కొన్ని కేసులు బయటకు రావడం లేదు. మరోవైపు అత్యాచారాలు, లైంగిక నేరాలకు ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకుని వచ్చినా.. అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఫోన్లో పేర్కొన్నందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని, ఆ కాల్ బూటకమని తేలిందని పోలీసులు గురువారం తెలిపారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఈ మాట అన్నది మరెవరో కాదు బీజేపీ నేతలు. ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది.
అంతర్జాతీయ వేదికపై భారత్కు పతకాలు తెచ్చిన రెజ్లర్లు.. లైంగిక వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమపై జరుగుతోన్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్లు గళం వినిపిస్తున్నారు. వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసన ప్రదర్శనకు దిగారు.