లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్లలో సీట్ షేరింగ్కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి.
Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Delhi : ఢిల్లీలోని ద్వారకలో అత్తగారు, కోడలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న భారీ అగ్నిప్రమాదం వెలుగు చూసింది. అయితే ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.
పెళ్లి తర్వాత ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Delhi : ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న నలుగురు స్నేహితులు యమునా నదిలో మునిగి మృతి చెందిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం రేపుతోంది.
ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.