Delhi: పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి.. ఢిల్లీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
ఈ ఘటనపై గురువారం సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజీని పరిశీలించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రెస్టారెంట్ యజమాని ప్రమేయం ఉందని తేల్చారు. బాధితుడు జతిన్గా గుర్తించారు. జతిన్.. బుద్ విహార్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. జతిన్ను రక్షించే ప్రయత్నంలో అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “జతిన్, రెస్టారెంట్ వర్కర్ మధ్య ఏదో సమస్యపై మనస్పర్థలు వచ్చాయని.. దీంతో, జతిన్ మరియు రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదానికి దారితీసింది, ఆ తర్వాత సిబ్బంది జతిన్ ఛాతీపై కత్తితో పొడిచారు. అంతేకాకుండా.. అడ్డుకోబోయిన అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయి”. అని తెలిపారు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి జతిన్ తన స్నేహితులతో కలిసి పితంపురలోని వర్దమాన్ మాల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “కత్తిపోటుకు గురైన తర్వాత, జతిన్ను హడావిడిగా ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు, తెల్లవారుజామున 3.27 గంటలకు, పిసిఆర్కి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం గురించి కాల్ వచ్చింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించిన బృందం స్థానిక సమాచారాన్ని సేకరించి సాక్షుల నుంచి తగు విచారణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారి తెలిపారు.
Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. పవన్పై మంత్రి కొట్టు సెటైర్లు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!