Delhi: పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి.. ఢిల్లీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
ఈ ఘటనపై గురువారం సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజీని పరిశీలించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రెస్టారెంట్ యజమాని ప్రమేయం ఉందని తేల్చారు. బాధితుడు జతిన్గా గుర్తించారు. జతిన్.. బుద్ విహార్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. జతిన్ను రక్షించే ప్రయత్నంలో అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “జతిన్, రెస్టారెంట్ వర్కర్ మధ్య ఏదో సమస్యపై మనస్పర్థలు వచ్చాయని.. దీంతో, జతిన్ మరియు రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదానికి దారితీసింది, ఆ తర్వాత సిబ్బంది జతిన్ ఛాతీపై కత్తితో పొడిచారు. అంతేకాకుండా.. అడ్డుకోబోయిన అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయి”. అని తెలిపారు.
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి జతిన్ తన స్నేహితులతో కలిసి పితంపురలోని వర్దమాన్ మాల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “కత్తిపోటుకు గురైన తర్వాత, జతిన్ను హడావిడిగా ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు, తెల్లవారుజామున 3.27 గంటలకు, పిసిఆర్కి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం గురించి కాల్ వచ్చింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించిన బృందం స్థానిక సమాచారాన్ని సేకరించి సాక్షుల నుంచి తగు విచారణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారి తెలిపారు.
Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. పవన్పై మంత్రి కొట్టు సెటైర్లు
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!