Delhi: పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి.. ఢిల్లీలో ఘటన
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
ఈ ఘటనపై గురువారం సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజీని పరిశీలించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రెస్టారెంట్ యజమాని ప్రమేయం ఉందని తేల్చారు. బాధితుడు జతిన్గా గుర్తించారు. జతిన్.. బుద్ విహార్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. జతిన్ను రక్షించే ప్రయత్నంలో అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “జతిన్, రెస్టారెంట్ వర్కర్ మధ్య ఏదో సమస్యపై మనస్పర్థలు వచ్చాయని.. దీంతో, జతిన్ మరియు రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదానికి దారితీసింది, ఆ తర్వాత సిబ్బంది జతిన్ ఛాతీపై కత్తితో పొడిచారు. అంతేకాకుండా.. అడ్డుకోబోయిన అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయి”. అని తెలిపారు.
Also Read
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి జతిన్ తన స్నేహితులతో కలిసి పితంపురలోని వర్దమాన్ మాల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “కత్తిపోటుకు గురైన తర్వాత, జతిన్ను హడావిడిగా ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు, తెల్లవారుజామున 3.27 గంటలకు, పిసిఆర్కి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం గురించి కాల్ వచ్చింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించిన బృందం స్థానిక సమాచారాన్ని సేకరించి సాక్షుల నుంచి తగు విచారణ చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారి తెలిపారు.
Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. పవన్పై మంత్రి కొట్టు సెటైర్లు
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!