Mallikarjun Kharge: రాష్ట్రపతికి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi murmu) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.
Also Read
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
లేఖలో ఏముందంటే..
సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంతో దేశ యువతకు అన్యాయం జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. సాయుధ దళాల్లో శాశ్వత ఉపాధి కోరుకునే యువతకు అగ్నిపథ్తో అన్యాయం జరుగుతోందని ఖర్గే పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సాయుధ బలగాల్లో శాశ్వత నియామకాలను నిలిపివేయడంతో దాదాపు 2 లక్షల మంది యువత భవిష్యత్తులో అనిశ్చితి నెలకొందన్నారు.
ఈ పరిణామం ఆత్మహత్యలకు దారి తీసిందని ఖర్గే గుర్తుచేశారు. యువత సమస్యలు ఎదుర్కొంటుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. వారికి న్యాయం చేయాలని రాష్ట్రపతి ముర్మును కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. అగ్నిపథ్ విధానం రద్దు చేస్తామని ఖర్గే పేర్కొన్నారు. దాని స్థానంలో పాత నియామక పద్ధతిని పునరుద్ధరిస్తామన్నారు.
తీవ్ర ఆందోళనలకు తెర లేపిన..
అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ఈ నియామక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు అంటారు. 2022 జూన్ 14 న భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుంచి అమలు చేయాలని తలపెట్టింది. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఇక నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.
ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుంచి విరమణ పొందాక పింఛను రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి.
ఇక ఈ పథకంపై దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. హింస జరిగింది. 12 రైళ్ళను తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేయడం, రద్దు చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు చెలరేగిపోయారు. స్టేషన్ ధ్వంసం చేయడంతో పాటు పలు రైళ్లను తగలబెట్టారు.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!