దేశ రాజధాని ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వాడకంపై అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, పేల్చడానికి అనుమతి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసిన నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజేష్భాయ్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందినవాడిగా వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక... ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి. భారత్ కాల్పుల విరమణ ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆప్ ఆరోపించింది.
స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది.
ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.