Delhi: సీఎం రేఖా గుప్తాకు అతిషి లేఖ.. దేనికోసమంటే..!
- సీఎం రేఖా గుప్తాకు అతిషి లేఖ
- రూ.2,500 పథకంపై చర్చించాలని వినతి
- సమయం ఇవ్వాలని రేఖా గుప్తాకు మనవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
ఇది కూడా చదవండి: Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఈనెల 20నే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆయుష్మాన్ భారత్ పథకంపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రేఖా గుప్తా ప్రమాణస్వీకారం రోజునే అతిషి ప్రెస్మీట్ పెట్టి.. తొలి కేబినెట్లోనే మహిళలకు రూ.2,500 పథకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా? అని నిలదీశారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. దీనిపై శుక్రవారం రేఖా గుప్తా స్పందిస్తూ.. ఒక్క రోజు కాకముందే అతిషి విమర్శలు చేస్తున్నారంటూ తప్పుపట్టారు. కాంగ్రెస్, ఆప్ పాలించిన రోజులు గుర్తుచేశారు. మీరేం చేశారంటూ రేఖా గుప్తా తిరిగి ప్రశ్నించారు. తాజాగా మరోసారి అతిషి.. మహిళలకు రూ.2,500 పథకం గురించి లేఖ రాశారు. దీనిపై రేఖా గుప్తా ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆప్ 22 సీట్లు సాధించాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనూహ్యంగా రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉండడంతో అవకాశం దక్కినట్లుగా వార్తలు వినిపించాయి.
Former Delhi CM and AAP leader Atishi writes to Delhi CM Rekha Gupta seeking time to meet the AAP Legislature Party on February 23 regarding the scheme of giving Rs 2500 per month to women in Delhi. pic.twitter.com/S04vztiOmQ
— ANI (@ANI) February 22, 2025
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!