Rekha Gupta: స్కూల్ ఫీజుల పెంపుపై సీఎం ఆగ్రహం.. అవసరమైతే స్కూళ్లు రద్దు చేస్తామని వార్నింగ్
- స్కూల్ ఫీజుల పెంపుపై సీఎం రేఖా గుప్తా ఆగ్రహం
- అవసరమైతే స్కూళ్లు రద్దు చేస్తామని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది. అంతేకాకుండా స్కూల్ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎక్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మండిపడ్డారు. ఫీజుల పెంపును సహించబోమన్నారు. పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేసినా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఫీజుల పెంపునకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఫీజులు పెంచితే తర్వాత బాధపడాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదులు అందగానే పాఠశాలలకు నోటీసులు పంపిస్తామని రేఖా గుప్తా మీడియాతో అన్నారు. పిల్లల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఏ విధమైన దోపిడీ, అన్యాయాలను జీరో టాలరెన్స్ విధానంతో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, నాణ్యమైన విద్య లభించాలని కోరారు.
ఫీజుల పెంపుపై ప్రతిపక్ష పార్టీ ఆప్ ఆరోపించింది. అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు భరత్ అరోరాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని.. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని ఆరోపించారు. అందుకే ప్రైవేటు స్కూళ్లు ఫీజులు పంచేశాయని ధ్వజమెత్తింది. బీజేపీ ప్రభుత్వం రాగానే ఫీజులు పెంచేశారని మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Film Updates : విషు పండుగ కానుకగా తమిళ్, మలయాళ సినిమాల స్పెషల్ అప్డేట్స్
ఆప్ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, మాజీ ముఖ్యమంత్రి అతిషి సోషల్ మీడియాలో అబద్ధాలు, గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారని వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా శ్రేయస్సు పథకం, ఆయుష్మాన్ భారత్, విద్యుత్ కోతలు వంటి అంశాలపై వారి ప్రచారం విఫలమైంది.. తాజాగా రాజకీయ మైలేజ్ కోసం పాఠశాల ఫీజుల పెంపు అంశాన్ని చేపట్టారని.. కానీ వారు విజయం సాధించలేరు.’’ అని సచ్దేవా పేర్కొ్న్నారు.
आज जनसंवाद कार्यक्रम के दौरान क्वीन मैरी स्कूल, मॉडल टाउन से संबंधित एक मामला सामने आया, जिसमें बच्चों के परिजनों ने गलत तरीके से फीस वसूली और बच्चों को स्कूल से निकाले जाने की शिकायत दर्ज की।
इस विषय पर तुरंत संज्ञान लेते हुए संबंधित अधिकारियों को तत्काल जांच कर कड़ी और आवश्यक… pic.twitter.com/gVThK6jFTn
— Rekha Gupta (@gupta_rekha) April 15, 2025
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!