CM In Metro: మెట్రోలో ప్రయాణించిన సీఎం.. వైరల్ అవుతున్న వీడియో..
- వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా మెట్రోలో ప్రయాణించిన సీఎం రేఖా గుప్తా
- ఢిల్లీ గేట్ నుంచి లాజ్పత్ నగర్ వరకు ప్రయాణించిన సీఎం
- పేదల కోసం 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మెట్రోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. గురువారం ఆమె ఢిల్లీ గేట్ నుంచి లాజ్పత్ నగర్ వరకు మెట్రోలో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మెట్రోలోని ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సీఎం వెంటనే ప్రజలతో మమేకమవుతూ, పలువురితో సెల్ఫీలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సీఎం చేసిన ఈ మెట్రో ప్రయాణం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజా రవాణా వినియోగంపై అవగాహన పెంచడమే కాకుండా, ప్రజలకు దగ్గరగా ఉండాలనే తన ఉద్దేశాన్ని రేఖా గుప్తా ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మెట్రోలో ప్రయాణించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
అనంతరం ఢిల్లీలో పేదల కోసం 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభించినట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఈ పథకానికి ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లను కేటాయించింది. ప్రతి అటల్ క్యాంటీన్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచనున్నారు. పేదలు, కూలీలు, కార్మికులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే ఈ పథక లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Today, 23 years ago, then Prime Minister Atal Bihari Vajpayee inaugurated the first Delhi Metro train between Shahdara and Tis Hazari.
Since then, that first train, TS#1, has covered more than 29 lakh kilometres and carried over 6 crore passengers.
On the 23rd anniversary of… pic.twitter.com/HenzPDKAEK
— Facts (@BefittingFacts) December 25, 2025
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!