ఐపీఎల్ 2025కి ముందు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)లను డీసీ రిటైన్ చేసుకుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి దృష్టి పంత్పైనే ఉంది. అతడికి ధర ఖాయం అని అందరూ…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.…
Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రతీ ప్రాంచైజీకి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఒకరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ (జాతీయ జట్టుకు ఆడని ఆటగాడు) ఉండాలి. విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి రూ.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి తమకు నచ్చిన…
Delhi Capitals Retained Players for IPL 2025: నవంబర్ నెలలో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా తన జట్టును సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్ను ఢిల్లీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఓ స్టార్ ప్లేయర్లతో…
Rohith Sharma In IPL: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఢిల్లీ, లక్నో ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఒకవేళ రోహిత్ ముంబైని వదిలేసి వేలంలోకి వస్తే.. రూ.50 కోట్లైన సరే దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ రెండు ఫ్రాంచైజీలు రూ. 50 కోట్ల మనీ పర్స్ ని సేవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫ్రాంఛైజీలకు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. ఈ నేపథ్యంలో…
Delhi Capitals Next Target is Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్గా ఉన్న రికీ పాంటింగ్పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్ను తొలగిస్తూ…
Rishabh Pant on Delhi Capitals Playoffs: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఆడుంటే.. ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరేదన్నాడు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెబుతున్నా అన్నాడు. ఐపీఎల్ 2024లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంత్పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆడలేదు. ఆ మ్యాచ్లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని…