Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పంత్.. 9ఏళ్ల ప్రయాణంపై ఎమోషనల్ పోస్టు (వీడియో)
- ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని వీడిన పంత్
- పంత్ను ఏకంగా రూ. 27కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్
- డీసీ నుంచి విడిపోవడంపై ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని వీడాడు. పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ పంత్ను ఏకంగా రూ. 27కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే.. ఈ స్టార్ బ్యాట్స్ మెన్ 2016లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. తాజాగా రిషబ్ .. డీసీ నుంచి విడిపోవడంపై మంగళవారం భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నాడు.
READ MORE: Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..
Also Read
‘‘ఢిల్లీ జట్టుతో తొమ్మిదేళ్ల నా ప్రయాణం చాలా అద్భుతమైంది. చిన్న వయసులో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాను. ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలను గ్రౌండ్లో ఎదుర్కొన్నాను. నేను నేర్చుకున్న ప్రతీది నా అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. ఢిల్లీతో నా ప్రయాణం.. నాకెంతో విలువైంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభిమానులు నాకు అండగా ఉన్నారు. తాజాగా నేను ముందుకు వెళ్తున్నప్పటికీ .. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో అలాగే ఉండిపోతాయి. మా ప్రదర్శనతో మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తూనే ఉంటా. ఈ నా ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ భావోద్వేగంతో పోస్ట్ షేర్ చేసుకున్నాడు.
కాగా.. రిషబ్ పంత్ పోస్ట్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ కూడా ఓ భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. పార్థ్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో.. “రిషబ్ పంత్.. నువ్వు ఎప్పుడూ నా తమ్ముడిగా ఉంటావు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు సంతోషంగా ఉన్నారని, మిమ్మల్ని నా కుటుంబీకుడిలా చూసుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. మీరు వెళ్లడం చూసి నేను కూడా చాలా బాధపడ్డాను. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. మీరు ఎల్లప్పుడూ ఢిల్లీ క్యాపిటల్స్లో ఉంటారు. ఏదో ఒక రోజు మనం తిరిగి కలుస్తామని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు రిషబ్.. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటామని గుర్తుంచుకోండి. బాగా ఆడండి.. ప్రపంచం మీ పాదాల వద్ద ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మీకు శుభాకాంక్షలు.” అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!