ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. దీంతో ఢిల్లీ సచివాలయం సీజ్ చేశారు.. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.. ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఎల్జీ ఆదేశించారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామన్న మోడీ గతంలో చెప్పారు. ఇప్పుడు బీజేపీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది.…
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సృష్టించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు ప్రధాని మోడీపై తమ విశ్వాసాన్ని చూపించారన్నారు. తన గెలుపునకు మోడీకి, ఢిల్లీ ప్రజలు కారణమని, ఆ ఘనత వాళ్లకే దక్కుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా తాము ప్రజల మద్దతు పొందలేకపోయామన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఏర్పడుతున్న ప్రభుత్వం ప్రధాని మోడీకి గొప్ప…
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సృష్టించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 3181 ఓట్ల భారీ ఆధిక్యంతో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో "జైశ్రీరామ్" అని రాసుకొచ్చారు. ప్రస్తుతంపర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. READ MORE:Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..? ఇదిలా ఉండగా.. దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం…
కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఆతీశీ విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు. ఆయన ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధురిని ఓడించారు.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు.
ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లు వీఐపీ సీట్లపైనే ఉన్నాయి. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం అత్యంత ముఖ్యమైన స్థానం. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి…
ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 38 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్ల వల్ల ప్రభావితమైన, ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అసెంబ్లీ స్థానాల ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా.. గత రెండు ఎన్నికల్లో…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP) ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.