Delhi Secretariat sealed: ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్ట్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం..
- ఎన్నికల్లో మెజారిటీ దిశగా బీజేపీ
- ఢిల్లీ సచివాలయం సీజ్ చేయాలని ఎల్టీ ఆదేశం
- ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. దీంతో ఢిల్లీ సచివాలయం సీజ్ చేశారు.. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.. ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఎల్జీ ఆదేశించారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామన్న మోడీ గతంలో చెప్పారు. ఇప్పుడు బీజేపీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కాగా.. మరోవైపు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనీష్ సిసోడియా కూడా జంగ్పురా నుంచి ఓటమిని అంగీకరించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం.
READ MORE: Anna Hazare: ‘‘ఆయన దృష్టి అంతా మద్యం పైనే’’.. అన్నా హజారే సంచలన ఆరోపణ..
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడిపోయింది. కేవలం 23 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది. దేశ రాజధానిలో బీజేపీ 27 సంవత్సరాలుగా బహిష్కరణను ఎదుర్కొంది. తాజాగా బీజేపీకి సంకెళ్లు వీడాయి. ఢిల్లీలో, ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 మరియు 2020లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతీశీ సెప్టెంబర్ 2024 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 1998, 2003, 2008లలో కాంగ్రెస్ గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది.
READ MORE: Parvesh Sahib Singh: గెలుపు క్రెడిట్ వారికే.. కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!