ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు సరిగా లేకపోవడం వల్ల అప్పులు తీసుకుంటున్నారు. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారని, పోలీస్ దాడులతో..కొద్దిరోజులు లోన్స్ ఇవ్వటం ఆపేశారన్నారు. అధిక లాభాలు…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేట మోతీనగర్కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు.…
Fake messages in the name of Collector Suryakumari కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ గురించి తెలియని వారి నుంచి ఇంతో అంతో తెలిసిన సామాన్యుడి వరకు ఏదో ఒక రూపంలో సైబర్ దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది వారి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారే డబ్బు…
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ…
ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసి రూ. 12 కోట్లకు పైగా డబ్బులను కేటుగాళ్లు కాజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా.. మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మల్లింపుకు సంహరించిన ఖాతాదారులపై పోలిసుల దృష్టి సారించారు. దీంతో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ బెంగుళూరు పూణే ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీస్ బృందాలు…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేటుగాళ్ల వలలో చిక్కి ప్రజలు లక్షలు మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా రెండు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ అకౌంట్కు చెందిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని సదరు మహిళను చీటర్స్ భయపెట్టారు. దీంతో నిజమని నమ్మిన ఆ మహిళ బ్యాంకు…
హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాజహాన్…
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వీఐపీలను బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కన్నాభాయ్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సీఎంని చంపేస్తామంటూ ట్వీట్స్ చేసిన పవన్ ఫణి అరెస్ట్ అయ్యాడు.సైబర్ క్రైం ఎస్పీ రాధిక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మానవబాంబుగా మారి సీఎంను చంపేస్తానంటూ పోస్టింగులు చేశాడు. పవన్ ఫణి జనసేన మద్దతుదారుడని, ట్విట్టర్లో పోస్టులు పెట్టి…
సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్ను సంప్రదించింది.…
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…