మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్…
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. అయితే తాజాగా రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్తున్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడిన నైజీరియన్ నేరగాన్ని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మెహదీపట్నంకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు నుంచి…
ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి…
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.
లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేసారు.టైల్ బేసిక్ లో కలకత్తా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటి 18 లక్షల రూపాయలు డ్రా చేసారు నిర్వాహకులు. లోన్ యాప్ ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ చెందిన అనిల్ నల్లమోతు ద్వారా డబ్బులను డిపి చేసారు చైనా కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసులు పేరుతో బ్యాంకులను బెదిరించిన అనిల్…
కరోనా ఆర్టిపిసిఆర్ పరిక్షలు చేస్తామంటూ ఘరానా మోసం చేసారు. ఇండియా మార్ట్ లోఫోన్ నంబర్ తో లాగిన్ అయిన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి కి ఆర్టిపిసిఆర్ టెస్ట్ లు చేస్తామని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. తన ఇంట్లో పది మంది ఉన్నారని తెలిపాడు బాధితుడు. అతని దగ్గర నుండి డెబిట్ కార్డ్ వివారలు అడిగి ఓటిపి తీసుకున్నారు నేరగాళ్ళు. ఆ ఖాతాలో ఉన్న మొత్తం 2.94లక్షలు కాజేసారు నేరగాళ్ళు. దాంతో హైదరాబాద్…
సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం బయట పడ్డింది. సంస్థల వెబ్ సైట్ లో సిఈఓ మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. అత్యవసరంగా 10 వేల రూపాలయల యామెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపారు. నిజమే అనుకుని గిఫ్ట్ కార్డ్ పంపారు నిజామాబాద్ గనుల శాఖ అధికారి.…