సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్…
చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు. మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. యువతి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్…
దేశం ఏదైనా మహిళలపై జరుగుతున్న ఆరాచకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు మహిళలపై హింసా పెరిగిపోతూనే ఉన్నది. లైంగికంగా హింసిస్తూనే ఉన్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ చెందిన ఓ నర్సు పుస్తకాలను బుక్ చేసింది. డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెకు ఆన్లైన్ డెలివరీ బాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పార్సిల్ను పక్కన ఉన్న ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నర్స్ పక్కింటి నుంచి పార్సిల్ కవర్ను తీసుకున్నది. ఈ తరువాతే…
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తారామతి పేటలో దారుణం చోటు చేసుకుంది. తారామతి పేటలో జీవిస్తున్న ఇద్దరు భార్య భర్తలకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు కొందురు దుర్మార్గులు. భార్య భర్తలకు మద్యం తాగించి మరి… రేప్ చేశారు కిరాతకులు. అయితే… ఈ రేప్ చేసిన వారు.. అతని స్నేహితులు కావడం గమనార్హం. భర్త మత్తులో ఉండగా అతని భార్య పై అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు ఇద్దరు దుర్మార్గులు. సృహ లోకి వచ్చాక చనిపోయిన…
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు.. ఆలాగే చూడాలి కూడా.. లోకం గురించి చెప్పేది, ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది వారే కాబట్టి.. కానీ ప్రస్తుతం కొంతమంది గురువులు చేసే పనులు.. సమాజానికే సిగ్గుచేటుగా మారుతున్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వవలసినవారు..కామాంధులుగా మారుతున్నారు. మహిళల గురించి సమాజానికి చెప్పాల్సినవారే.. మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక ప్రొఫెసర్ విద్యార్థినులకు చదువు చెప్పి ఉన్నత స్థానానికి పంపించాల్సింది పోయి.. బెదిరించి వ్యభిచార గృహాలకు పంపుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే…
ఇటీవలే తెలుగు నటి చౌరాసియాపై కేబీఆర్ పార్క్ వద్ద ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్క్లో ఎప్పటిలాగే వాకింగ్ కోసమని వెళ్లాలనని, పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని నటి చౌరాసియా తెలియజేసింది. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మొహంపై గుద్దాడని తెలిపింది. తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే ఫోన్పే చేస్తానని, నెంబర్ ఇవ్వమని అడిగినట్టు నటి…
భర్త ఇంటికి రావడంలేదని చెప్పి ఓ మహిళ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ కేసు దాఖలు చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి కనిపించడంలేదని కేసులో పేర్కొన్నది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు ఆమె భర్తను వెతికి కోర్టులు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగంగా ముగించారు. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదికను చూపి హైకోర్టు షాక్ అయింది. Read: నేటి నుంచి శబరిమల ఆలయంలోకి భక్తుల…
దేశ నేర చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటన మహరాష్ర్టలో ని బీడ్ జిల్లాలో తాజగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత పేదరికంలో నూ తన సొంత కాళ్లపై నిలబడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఆసరాగా తీసుకుని పరిచయమైన ప్రతివాడు ఆమెను చెరిచాడు. ఉద్యోగం ఇప్పించకపోగా శారీరక వాంఛను తీర్చుకునేందుకు చూశారు. కాగా పోలీస్స్టేషన్కు వెళితే అక్కడకూడా పోలీసులు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇవన్నీ బాలిక…