Home
Crime
Crime News
-
హోంగార్డ్ వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య యత్నం
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జియాగూడకు చెందిన రాజు అనే వ్యక్తి .. హోంగార్డు అమర్నాథ్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 4వ తేదిన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ దొంగతనం కేసులో అరెస్టైన తన తమ్ముడిని కలవడానికి వెళ్లిన రాజును హోం గార్డు అమర్నాథ్ తీవ్రంగా కొట్టి దుర్భాషలాడడాని దీంతో మనస్థాపానికి గురైన రాజు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు. Read Also: ఆగని… -
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై గొడ్డలితో దాడి
అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ళ కిందట వివాహాం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ జహాంగీర్ గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో వివాహిత భర్త రాజు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లష్కర్గూడ, సుర్మయ్గూడకు చెందిన రాజు అదే గ్రామానికి చెందిన మైనార్టీ యువతిని ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. Read Also:పంజాబ్ ఐకాన్గా ఉండను: సోనూసూద్ ఈ రోజు ఆస్పత్రికి… -
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తుంది: మధుయాష్కీ
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు… -
మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి
దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు… -
వారం క్రితం వివాహం.. పెళ్ళికొడుకుని మింగేసిన ఆర్టీసీ బస్
వారం రోజుల క్రితమే పెళ్ళయింది. పెళ్ళి కూతురు కాళ్ళ పారాణి కూడా ఆరలేదు. కానీ విధి రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్ కొత్త పెళ్ళికొడుకు ప్రాణాలను బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా… -
జూబ్లిహిల్స్ లో యువతికి వేధింపులు… అసభ్య ప్రవర్తన
యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా వేధించడం ఎక్కువైంది. హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గాయత్రీహిల్స్లో బ్యూటీ… -
‘సంధ్య’ శ్రీధర్ పై ఈడీ కన్ను. ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎంక్వయిరీ
హైదరాబాద్లో సంచలనం కలిగించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంపై దృష్టి సారించింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి 7, నార్సింగి, రాయదుర్గం పీఎస్ లో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. మొత్తం సైబరాబాద్ లో 13 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో మూడు కేసులు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్… -
వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం చేశాడట…
మహారాష్ట్రలోని నాగపూర్లోని యశోధరానగర్లో వరసగా వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఈకేసులో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 వాహనాలును రికవరి చేసేశారు. అయితే, పదో వాహనం గురించి సర్పరాజ్ అనే దొంగను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. చలి బాగా పెరిగిపోవడంతో బైక్కు నిప్పు అంటించి చలికాసుకున్నామని చెప్పాడు. దొంగచెప్పన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నలుగురు… -
మయన్మార్లో దారుణం… విరిగిపడ్డ కొండచరియలు… 70 మంది గల్లంతు…
మయన్మార్లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండా హటాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 70 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఖనిజాల గనుల్లో జాడే గనులు ఒకటి. పెద్ద గనులు మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన గనులు కూడా. Read: ఒమిక్రాన్పై బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు… ఈ… -
విమానాశ్రయంలో 3 కేజీల బంగారం పట్టివేత…
కేరళ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారం పట్టుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో 1.68 కోట్ల విలువ చేసే 3.36 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు.బంగారాన్ని పేస్టుగా మార్చి… ఆ పేస్టుగా మార్చిన బంగారాన్ని నాలుగు కవర్స్ లో ప్యాకింగ్ చేసి విమానం క్రూ క్యాబిన్ సీటు కింద దాచారు కేటుగాళ్లు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్ నుండి కొచ్చిన్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు నిర్వహించింది కస్టమ్స్ బృందం.…
తాజావార్తలు
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!