భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Murder: నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతోంటే, మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు మానవీయతకు, సంబంధాల సమతౌల్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తుల కోసం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దుశ్చర్యలకు వెనకాడకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే, రక్త సంబంధాలను కూడా వదిలిపెట్టకుండా, తమ దురాశ కోసం మరణాలకు కూడా కారణమవుతున్నారు. ఇటువంటి శోచనీయ సంఘటన పాల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు…
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్రావుగా గుర్తించారు.
Lady Don : మోస్ట్ వాండెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆపరేషన్ ధూల్పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం అంగూర్ బాయ్ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్పేట్లో గంజాయి డాన్గా పేరున్న అంగూర్ బాయి పది కేసులలో నిందితురాలిగా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలం ఆమె పోలీసుల చేతిలో చిక్కకుండా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అంగూర్ బాయిపై గంజాయి అమ్మకాలకు సంబంధించి 3…
Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్ని స్కూల్కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది.
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్స్టాగ్రామ్కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు.
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది.
Black magic: ఘజియాబాద్లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడని అరెస్ట్ చేసిటనట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.