Crime: ఉత్తర్ ప్రదేశ్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్కేస్ కనిపించింది. అనుమానం రావడంతో సూట్కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్బాడీ ఉంది. ముందుగా ఈ సూట్కేస్ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.
Karnataka: తల్లికూతుళ్లు ఇద్దరు వ్యభిచారం చేస్తు్న్నారని ఆగ్రహించిన ఇరుగుపొరుగు వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఇంటిని నుంచి బయటకులాగి కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60,29 ఏళ్ల వయసు కలిగిన తల్లికూతుళ్లతపై దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు.
మణిపూర్లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Crime: విద్య నేర్పిస్తారని నమ్మి వచ్చిన విద్యార్థిని చెరబట్టారు ఇద్దరు టీచర్లు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లిన ఓ మైనర్పై నగరంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్కు చెందిన ఇద్దరు ప్రముఖ ఉపాధ్యాయులు నెలల తరబడి అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేశారు.
Bengaluru: బెంగళూర్లో ఓ జంట తమ అపార్ట్మెంట్లోని బాల్కనీలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు. సిక్కింకి చెందిన ఈ జంటన బెంగళూర్లో తాము నివాసం ఉంటున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. సిక్కింకి చెందిన కె. సాగర్ గురుంగ్ (37), అతని భార్య ఊర్మిళ కుమారి (38) తమ బాల్కనీలోని రెండు కుండాల్లో అలంకార మొక్కలతో పాటు గంజాయిని నాటారు.
UP: ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్కి ఖరీదైన గిఫ్ట్స్ కొనివ్వడానికి ఓ యువకుడు బ్యాంక్కే కన్నం వేశాడు. ప్లాన్ విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్లోని బరాబంకిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన కెనడాలోని ఓ గర్ల్ఫ్రెండ్ కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ సమద్ ఖాన్ అలియాస్ షాహిద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
Shocking Incident: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో దారుణం జరిగింది. 45 ఏళ్ల మహిళ, 25,17,15 ఏళ్ల వయసు ఉన్న ఆమె ముగ్గురు పిల్లలు కాల్చి చంపబడ్డారు. భర్త కనిపించకుండా పోవడంతో ఈ హత్యలో అతడి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో, ఒక నిర్మాణ స్థలంలో అతను కూడా మరణించి కనిపించాడు.