Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Cbi Arrests 2 Accused 19 Years After They Killed Woman Her Twin Babies In Kerala

CBI: కేరళలో మహిళ, ఇద్దరు పిల్లల హత్య.. 19 ఏళ్ల తర్వాత నిందితుల అరెస్ట్.. ఎలా చిక్కారంటే..?

Published Date :January 4, 2025 , 10:04 pm
By Venu Goapl Reddy
  • 2006 సంచలనంగా మారిన కేరళ మహిళ, పిల్లల హత్య..
  • 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టుకున్న సీబీఐ..
  • మారుపేర్లలో పుదుచ్చేరిలో నివాసం..
CBI: కేరళలో మహిళ, ఇద్దరు పిల్లల హత్య.. 19 ఏళ్ల తర్వాత నిందితుల అరెస్ట్.. ఎలా చిక్కారంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CBI: మహిళ, ఆమె ఇద్దరు కవల పిల్లలను హత్య చేసిన నేరంలో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. పుదుచ్చేరిలో అరెస్ట్ చేసి జ్యుడిషియన్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ, ఆమె నవజాత కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు.

ఈ కేసు విషయానికి వస్తే.. ఫిబ్రవరి 10, 2006న కొల్లాంలోని ఆంచల్‌‌లో 24 ఏళ్ల మహిళ, ఆమె 17 రోజుల వయసు ఉన్న శిశువులను దారుణంగా హత్య చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును 2010లో కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఫిబ్రవరి 6, 2010లో కేసుని తిరిగి నమోదు చేసింది.

Read Also: Pawan Kalyan :చరణ్ ఏడేళ్ల వయసులో చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు!

కొల్లంకు చెందిన దివిల్ కుమార్, అతడి స్నేమితుడు రాజేష్ ఈ హత్యలకు పాల్పడినట్లు సీబీఐ విచారణ తేలింది. అప్పటి నుంచి ఇద్దరూ పరారీలో ఉన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత సీబీఐ ఎర్నాకులం చీఫ్ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ ముందు చార్జిషీట్ దాఖలు చేసింది. దివిల్, రాజేష్‌లను ప్రధాన నిందితులుగా చేస్తూ కోర్టు ప్రకటిత నేరస్తులుగా ప్రకటించింది. ఒక వ్యక్తి చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకున్న తర్వాత అవసరమైన విధంగా కోర్టుకు హాజరుకావడంలో విఫలమైన తర్వాత ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించబడుతాడు.

పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా సీబీఐ అధికారులు ఎట్టకేలకు దివిల్ కుమార్, రాజేష్‌లను పుదుచ్చేరిలో ట్రాక్ చేసి జనవరి 3న అరెస్ట్ చేసింది. దివిల్ తన పేరును విష్ణుగా, రాజేష్ తన పేరును ప్రవీణ్ కుమార్‌గా మార్చుకున్నారు. పుదుచ్చేరిలో పెళ్లి చేసుకుని ఆస్తులు కొనుగోలు చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. నిందితులిద్దరినీ శనివారం ఎర్నాకులంలోని జురిస్డిక్షనల్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

ఎందుకు హత్య చేశారు.?

నిందితుడన దివిల్ కుమార్ బాధితురాలు రంజినితో సంబంధం ఉంది. రంజిని పుట్టిన కవలలకు దివిల్ కుమార్ తండ్రని విచారణలో తేలింది. రంజిని సాయం కోసం గతంలో కేరళ మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది. 2006లో నిందితులు దివిల్, రాజేష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారని తేలింది.

తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రంజినితో రాజేష్ పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. దివిల్ కుమార్‌కి రంజినికి పెళ్లి జరిపిస్తానని నమ్మకలికాడు. ఫిబ్రవరి 10, 2006లో రంజిని, ఆమె ఇద్దరు కవలలను వారి అద్దె ఇంట్లోనే దారుణంగా చంపేశారు. పరారీలో ఉన్న నిందితులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ. 2 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటించింది.

ఎలా పట్టుకున్నారు..?

చాలా ఏళ్లుగా కనిపించని నిందితులు విదేశాలకు పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే, కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి వారి గుర్తింపుని కనుగొనే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను పోలీసులు వారి వద్ద ఉన్న ఫోటోలతో పోల్చారు. ఒక ఫోటోలో దివిల్ కుమార్ వివాహానికి హాజరైనట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు పెళ్లిళ్లు చేసుకుని పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు గుర్తించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI
  • crime
  • Crime News
  • Kerala
  • Kerala Murder Case

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions