త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రముఖులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్ను కేటుగాళ్లు మోసం చేశారు. వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్ను రూ. 7 కోట్ల మేర మోసగించిన అంతర్-రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం ఛేదించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క…
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. మద్యం తాగుతున్న కొడుకుని అడ్డుకున్నందకు తండ్రి హత్యకు గురయ్యాడు. తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను మరనించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోరఖ్పూర్లో జరిగింది. యువకుడు తండ్రి తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడైన కుమారుడు ప్రయత్నించాడు.
నంద్యాల జిల్లా డోన్లో దారుణం జరిగింది. తండ్రి బతికుండగానే చనిపోయాడని కుమారుడు లోకేష్ ఆస్తిని అమ్మేశాడు. తండ్రి బ్రతికి ఉన్నాడంటూ తండ్రితో కలసి పెద్ద కుమారుడు రామకృష్ణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.